25 నవం, 2011

ఈ మధ్య ఎవరి నోట విన్న ఈ పాట గురించే మాట్లడుతున్నారు.

ఈ పాట గురించి చెప్పాలంటే ....
 ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా ఇదే పాట వినిపిస్తుంది.
ఎవరి పేస్ బుక్ లో చూసినా ఈ పాట గురించే కామెంట్స్ కనిపిస్తున్నాయి.
ఇది ఇప్పుడు universal  హిట్  సాంగ్ గ మారింది. 
మా ఇంట్లో అయితే ఈ సాంగ్ సుప్రభాతం లా రోజు మోగుతూనే ఉంది. 
చూసినా కొద్దీ చూడాలని అనిపిస్తుంది. ఇందులో ధనుష్ గొంతు తో పాటు తను చూపించిన చేష్టలు (facial  expressions ) చాల చాల బాగున్నాయి. 
కింద ఉన్న లింక్ ని క్లిక్ చేసి  మీరు కూడా  ఎంజాయ్ చేసుకోండి, కాదు కాదు పండగ చేసుకోండి.
:) :) :) :) :) :) :):) :) :) :) :) :) :) :) :) :) :) :) :) :) :) :) :) :):) :) :) :) :) :) :) :) :) :) :) :) :) :) :) :) :):) :) :) :) :) :) :) :) :) :) :


http://www.youtube.com/watch?v=YR12Z8f1Dh8

19 నవం, 2011

@చివరిగా వ్రాసిన అజ్ఞాత గారు :




@చివరిగా వ్రాసిన అజ్ఞాత గారు : 

u said that, "u would fight against andhra governament".

before that u must think of ur local leaders . if they are doing well in ur constistution then ok, otherwise u must start ur fight agaist ur near by leader. 

be practical man... in our assembly we have telangana , andhra and rayalaseema leaders. so our governament is mixture of all three areas. dont say its andhra governamment. 

ఇంకో మాట ... తెలుగు లో ఒక  సామెత ఉంది ...  "మన బంగారం మంచిది కాకపొతే మందిని అంటే ఏమొస్తది" అని అది ఇక్కడ చక్కగా వర్తిస్తుంది. మన తెలంగాణా నాయకులు పేరుకే గాని ఒక్కడు కూడా అభివృద్ధి గురించి ఏనాడూ మాట్లాడరు.  మన అవసరాల గురించి ఎప్పుడైనా  పట్టించుకున్తున్నర..?  నేను ఓకే  ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను.. (  ఇక్కడ ఆంధ్ర , రాయలసీమ నాయకుల గురించి మాట్లాడ దలుచుకోలేదు, ఎందుకంటే నేను ఎప్పుడూ ఆ ప్రాంతాలకి వెళ్ళలేదు, నాకు అక్కడి నిజామైన పరిస్తితుల గురించి స్వంత అవగాహన లేదు . ఏదో పేపర్ లల్లోచదవడమే, T.V. లల్లో చూడటమే  తప్ప.)

                           మనకి పండుగలు వస్తే బస్సుల లలో, ట్రైన్స్ లల్లో రద్దీ విపరీతం గా ఉంటుంది . అసలు ఆ సమయాలల్లో ట్రైన్ ఎక్కితే కనీసం నిల్చొని వెళ్ళడానికి కూడా చోటు ఉండదు. ఇక స్టూడెంట్స్ అయితే ఫుడ్ బోర్డింగ్ లోనే ఉండి పోతారు. ఇవన్నీ నేను కట్టు కథలుగా  చెప్పట్లేదు. మీరు పండగ సమయం లో భాగ్యనగర్ ఎక్ష్ప్రెస్స్ గాని, లేదా తెలంగాణా ఎక్ష్ప్రెస్స్ గాని ఎక్కి చూడండి మీకే  తెలుస్తుంది. మరి అదే సమయలో మనం పేపర్లలో చూస్తుంటాం... గుంటూరు కి ఇన్ని ప్రత్యెక రైళ్ళు , విజయవాడ కి ఇన్ని ప్రత్యెక రైళ్ళు, రాజమండ్రి కి ఇన్ని ప్రత్యెక రైళ్ళు, విశాఖ పట్టణానినకి ఇన్ని ప్రత్యెక రైళ్ళు వేయబడ్డాయి అని కనిపిస్తుంది. అన్ని రైళ్ళ తో పాటు గా  ఏదో మచ్చుకు ఒకటో రెండో మన తెలంగాణా ప్రాంతానికి కూడా వేస్తారు. కాని ఇక్కడ  కుడా అంతే అవసరం ఉందీ, అందరూ పండుగలకి ఇంటికి వెళ్తారు ఎక్కువ రైళ్ళు అవసరం అవుతాయేమో అని ఆలోచించరు. ఇవన్నీ ఎవరు చేయాలి? మన తెలంగాణా నాయకులు చేయాలి, వాళ్ళు మన అవసరలాకి తగినన్ని వసతులు ఏర్పాటు అయ్యేలా చూడాలి, కాని ఏ ఒక్క తెలంగాణా నాయకుడైన పండగ సమయం లో వీటి గురించి మాట్లడుతాడ??? లేదు ఎవ్వరు మాట్లడరు . అప్పుడు మనం ఏమనుకుంటాం.. "అబ్బ వేరే ప్రాంతాల కి ఎన్ని కొత్త ట్రైన్స్ వేసారు మనకేమో ఒక్కటే "...అని ఇలా ఆలోచిస్తాం కాని మన ఇంటి నాయకులే సరిగ్గా లేరు వాళ్ళే కరెక్ట్ గా ఉంటె మనకి కూడా కొన్ని ఎక్కువ ట్రైన్స్ వచేవి అని మాత్రం అనుకోము. ఈ విధం గా ఏర్పడిన భేద భావన ని నేడు మన నాయకులు ఆసరాగా తీసుకొని మన మనస్తత్వాలతో ఆటాడు తున్నారు. ఇక్కడ మన వాళ్ళు ఏర్పాటు వాదం  అంటారు,  అక్కడ ఆంధ్ర వాళ్ళు సమైఖ్య వాదం అంటారు .

వీళ్ళ ఇద్దరి వాదనల్లోను వాళ్ళ వాళ్ళ స్వార్థమే ఉంది గాని, మామూలు మధ్య తరగతి వ్యక్తీ కి ఒరిగే మంచి ఏ మాత్రం లేదు. ఇప్పుడు తెలంగాణా వచ్చినా గద్దేనేక్కేది ఇదే నాయకులు, రాకపోయినా ఉండేది ఇదే నాయకులు. కాబట్టి ఈ నాయకుల కుటిల బుద్ది మారే వరకు కలిసి ఉన్నా, విడి పోయిన మాములు కుటుంబానికి కలిగే మంచి అయితే ఏమత్రం లేదు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. 

17 నవం, 2011

గాలి కి ఎంత ఆశ ! అది ఆశ కాదు దురాశ!

గాలి కి ఎంత ఆశ ! అది ఆశ కాదు దురాశ! రోజు కో కొత్త కేసు, రోజు లో కొన్ని వందల కోట్లు స్వాహా అంటున్న గాలి  వార్తలు "గాలి జనార్ధన రెడ్డి " గారి వార్తలు వింటుంటే ఒంట్లో రక్తం ఉడికి పోతుంది. ఒక మనిషి రోజు కి ఎంత తింటాడు? కడుపులో పట్టినంత అన్నమే కదా మనిషి తినగలడు. ఈ పుట తిన్నాక ఇంకొంచెం అన్నాన్ని మరో పూట కోసం దాచుకుంటాడు. అందులో తప్పు లేదు. ఒక మాములు ఉద్యోగి తను సంపాదించినా దాంట్లో  నుండి కొంచెం తన జీవితం గడపటానికి దాచుకుంటాడు. ఇంకా కొంచెం పెద్ద ఉద్యోగి లేదా ఒక వ్యాపారి అయితే తన పిల్లల భవిష్యత్తు  కోసం కొంచెం కూడ పెడతాడు. దానిలోనూ తప్పు లేదు. ఇలా ఒక వ్యక్తి కోసమో  లేదా కుటుంబాని కోసమో సరిపడేంత దాచుకుంటే అది సహజం.  దాన్ని ఎవరు తప్పు పట్టరు. కాని ఇప్పుడున్న కుటుంబానికే కాదు, తన వంశం మొత్తానికి ఇంకా తర్వాత పుట్టే వంశం వారికీ, వారికీ పుట్టే తరాల వారికీ ఇలా ... లెక్కలు వేసుకుంటే పొతే దాన్ని ఏమనాలి? తప్పు అనాలా వద్దా? అది తప్పు కాదు, మహా పాపం, అక్రమం, అన్యాయం,దోపిడీ , దురాశ. ఇలా తెలుగు లో నీచ బుద్ది కి ఎన్ని పర్యాయ పదాలుంటే అన్ని ఆ వ్యక్తి కి వర్తిస్తాయి. ఇది ఈనాటి మన రాజకీయ నాయకుల కథ. తను తినడమే కాదు , తన తర తరాల వారు కూడా కూర్చొని తిన్న తరగని ఆస్తి పాస్తులను సంపాదించుకుంటున్నారు. ఈ కథ కేవలం గాలి ఒక్కడి ది కాదు, ఇక్కడ జగన్ అన్న, అక్కడ మాయావతి , పక్కన A. రాజ ఇలా  ఎ ఒక్క పార్టీ కో, లేక ఎ ఒక్క రాష్ట్రానికో కాదు, మన భారత  దేశం మొత్తం ఒకటే సినిమా. దోచుకో ,దోచుకో, దోచుకో....( ఇంకా ఇలాంటి వాళ్ళు చాలానే ఉన్నారు మచుకు పెద్ద చాపలు ఇవి అనుకోండి. )
ఇలా పుట్టని తరాల వారికోసం కూడా ఇప్పుడే దోచుకొని దాచుకుంటే మరి ఇప్పుడు బతుకుతున్న మనిషి గతి ఏమవ్వాలి? దోచుకోవడానికి , దాచుకోవడానికి కాదు, కనీసం ఒక పూట కడుపు నింపు కోవడానికి కూడా అన్నం దొరకక విల విల లాడుతున్నాడు. పంటలు లేక రైతులు అల్లాడి పోతున్నారు. విపరీతమైన ధరల తో సాధారణ వ్యక్తి కుమిలి పోతున్నాడు. ఆసుపత్రి ఖర్చులు భరించలేక రోగులు నానా అవస్తలు పడుతున్నారు. మన చుట్టూ ఉన్న ఇంత మంది నరక యాతనలు అనుభవిస్తూ ఉంటే ఈ రాజకీయ నాయకులు ఎలా  ఎంత పడితే అంత  దోచుకు తినగలుగుతున్నారు ?  పక్కనున్న వ్యక్తీ పడే అవస్తలు వాళ్ళ కంటి కి కూడా కనపడటం లేదు. పైగా వాళ్ళ వ్రుత్తి  సమాజ  సేవ (రాజకీయ రంగం). వాళ్ళకి తిన్న తిండి ఎలా అరుగుతుందో ఏమో? ఇన్ని ఘోర పాపాలు చేస్తుంటే కంటి నిండా నిద్ర ఎలా పో గాలుతున్నారో ఏమో?
ఇలాంటి వాళ్ళని ఎవరు శిక్షిస్తారు?
       ఇప్పటికి మన దేశం లో చాల చోట్ల పక్క వీధి లో ఎవరైనా చని పొతే ఆ ఇంట్లో వాళ్ళు బాధల్లో ఉన్నారు, మనం మాత్రం వండుకొని తింటే ఎలా అని , వాళ్ళు కూడా ఆ రోజంతా తినకుండా పక్కింటి వారితో కలిసి దుఖాన్ని పంచుకుంటారు. అంతటి గొప్ప సంస్కృతి మనది. అలాంటి చోట పుట్టిన ఈ రాజకీయనాయకులకి ఈ దుర్భుద్ది ఎప్పుడు వీడుతుందో  ఏమో !!!!




ఈ కోదండ రామ్ ని ఏమనాలి?

ఈ కోదండ రామ్ ని ఏమనాలి? ఈయనకి నిజంగ తెలంగాణా రావాలని ఉందా అని ఒక చిన్న అనుమానం వేస్తుంది. ఎప్పుడు చుసిన ఏదో ఒక కొత్త పేరు తో బంద్ కి పిలుపు నిస్తాడు. ప్రజలని ఇబ్బందులకి గురి చేస్తాడు. ఆయన ఇంట్లో చిన్న పిల్లలు బడికి వెళ్ళే వయస్సు వారు లేరు కవోచు. ఉంటె తెలిసేది స్కూలు సమయం ఎంత గా వృధా అవుతుందో అని; ఆయనకి ఎదిగిన పిల్లలు (నిరుద్యోగులు గాని, కాలేజి చదువులు చదువుతున్న పిల్లలు) లేరు కావొచ్చు, ఉంటె తెలిసేది ఇంత వరకి కష్ట పడి చదివి  ఈ స్థాయికి చేరిన కొడుకో, కూతురి దో జీవితం ఇలా బందల కారణం గా ఆటంకాలకి గురవుతుందీ అని;  ఆయనకి నెల నెల జీతం సరిగ్గా వస్తుంది కావచు, అల నెల నెల జీతం  సరిగ్గా రాకపోతే ఇల్లు గడవడం ఎంత కష్టమవుతుందో అని, ఆయనకీ ఇంట్లో బి.పి, షుగర్ ఉన్న పెద్ద వాళ్ళు లేరు కావచు, ఉంటె తెలిసేది  నిరంతర బంద వల్ల ఇంట్లో కనీసం కరెంటు లేక ఫ్యాన్ తిరుగక , గాలి కుడా  ఆడక పొతే మనిషికి ఎంత కష్టం గా ఉంటుందో నని; ఆయన ఇంట్లో ప్రభుత్వ ఆఫీసులతో అయ్యే పనులు లేవు కావొచ్చు, ఉంటె తెలిసేది నెలల తరబడి ప్రభుత్వ కార్యాలయాలు ముసి ఉంటె ఆ అవసరం ఉన్న వారికి ఎంత ఇబ్బంది అవుతుందో  అని;  ఆయనకి ఇంట్లో గర్భిని స్త్రీలు లేరు కావొచ్చు, ఉంటె తెలిసేది అసలు సమయం లో ఆసుపత్రికి వెళ్ళాలంటే ఏ రవాణా (ఇటు బస్సులు, రైళ్ళు; అటు ఆటోలు ....) సదుపాయం కూడా లేకపోతె ఆ తండ్రి పడే ఆవేదన అర్థమయి ఉండేది.
ఇవన్ని కష్టాలు మన రాజకీయ ఐ.క.స. చైర్మన్ గారైన శ్రీ కోదండ రామ్ గారికి లేవు కావొచ్చు ఉంటె తెలిసేది అసలు బంద్ అనే చిన్న పదం వలన ఎంత పెద్ద ప్రమాద సృష్తి కి మూల పురుషుడు అవుతున్నాడు అని. కేవలం ఈ మహానుభావుడు ఒక్కడే కాదు, మన హరీష్ రావ్ గారు, కే.సి.ర గారు ఇంకా ఇలా బంద్ అనే పేరు ఎత్తుతున్న ప్రతి మహా మహారతులందరూ ఎప్పుడు ఈ బంద్ అనే అపదని ఆపేస్తారో అని అనిపిస్తుంది. ఇది కేవలం తెలంగాణా లోనే కాదు ఆంద్ర, రాయలసీమ , యావత్ భారత్ దేశం మొత్తానికి ఈ బంద్ అనే విపత్తు నుండి విముక్తి కావాలి. 
  నేను పైన వ్రాసిన ఉదాహరణలు కేవలం ఊహత్మకమ్ కాదు , మొన్న జరిగిన సకల జనుల సమ్మె వల్ల నా  చుట్టూ పక్కల ఉన్న వారు పడ్డ ఆవేదనలు. ఆ సమ్మె వలన మరి మన సమ్మె కి నాంది  పలికిన వీరులు ఏమంత ఘన విజయం సాధించారో ఏమో మరి. ఈ రోజేమో ఆయన గారు మనం మహానేత అయినటువంటి ఉత్తర ప్రదేశ్  ముఖ్య మంత్రి గారి బాటలో నడవాలని హితువు పలుకుతున్నాడు, అసలు ఈయనకి మాయావతి ఎంతటి గొప్ప చరిత్ర కలిగిన నేతనో తెలియదు కావొచ్చు. ఒక్కసారి ఒక నెల రోజుల కోసం కుటుంబం తో కలిసి  ఉత్తర ప్రదేశ కి వెళ్లి ఒక ఇల్లు అద్దె కి తీసుకొని ఉంటె తెలుస్తుంది, ఆమె గారి పరిపాలన ఎంతటి ఘనం గా సాగుతుందో అని; ఊరికే ఎవరిని పడితే వారిని ఉదాహరణ గా తీసుకుంటే ఇక అంటే సంగతులు. చిప్ప చేత పట్టుకొని రోడ్డునేక్కల్సిందే.  ఈ విషయాలన్నీ మన మహా మహా కుటిల రాజకేయ నాయకులకి ఎన్నడు అవగత మవుతాయో ఏమో?????