25 ఏప్రి, 2011

ఈసారి IPL లో ఆరెంజ్ కేప్ ఎవరికీ వస్తుందో...

ఈ సారి ipl  లో ఆరంజ్  కేప్ ఎవరికీ వస్తుందనేది నా ప్రశ్న. IPL మొదలు పెట్టినప్పటి నుండి మన దేశం లో క్రికెట్ పైన చాల మందికి ఉత్సాహం మరింత ఎక్కువయినట్లుంది.

 IPL లో  ఒక కొత్త రకం అవార్డులు సృష్తించబడినవి కదా  . అవే ఆరంజ్ కేప్ మరియు పుర్పుల్ కేప్. టోర్నమెంట్ మొత్తం లో ఎక్కువ రన్స్ చేసిన వారికీ ఆరంజ్  కేప్, ఎక్కువ వికెట్స్ తీసిన వారికి పుర్పుల్ కేప్ ఇవ్వడం జరుగుతుంది కదా.. మరి ఈ సారి ఈ ఆరంజ్  కేప్ చాల గమ్మతుగా ఒకరి నుంచి ఒకరికి కదులు తూ ఉంది . చివరికి ఎవరికీ వస్తుందో అని ఉత్సాహం గా ఉంది. నేనైతే మన మాస్టర్ బ్లాస్టర్ కే వస్తుందనుకుంటున్న. మరి మీరేమంటారు?
 
ఈ సారి ఇప్పటి వరకు ఎక్కువ రన్స్ చేసిన వాళ్ళని ఒక్కసారి చూద్దాం.
1) సచిన్ టెండూల్కర్  - 269 రన్స్ (M.I)
2) పాల్ వాల్తటి  - 261 రన్స్ (k.XI.P)
3) కల్లిస్  - 233 రన్స్ (KKR)
4) డేవిడ్ వార్నేర్  - 229 రన్స్ (D.D)
5)అంబటి రాయుడు - 201 రన్స్   (M.I) 
ఒక్కసారి 2008 నుండి  ఈ ఆరెంజ్ కేప్ ఎవరెవరిని వరించిందో చూద్దాం... 

2008----->షాన్ మార్ష్ ,616 రన్స్ (K.XI.P) 
2009----->మాత్యు హెడెన్ , (CSK)
2010----->సచిన్ టెండూల్కర్-618 (MI)


20 ఏప్రి, 2011

ఆంజనేయ స్వామి విగ్రహానికి చందనం ఎందుకు పూస్తారు?

మొన్న హనుమాన్ జయంతి జరుపుకున్నాం కదా... మరి మీలో చాల మంది గుడికి వెళ్లి ఉంటారు.అక్కడ ఆంజనేయ స్వామి ని మీ కోరికలతో ఉక్కిరి బిక్కిరి చేసే ఉంటారు. పూజారి గారు పెట్టిన వడ ప్రసదమో లేక, పులిహోర నో లేక శనగల ప్రసదమో ఇలా ఏదో ఒకటి తినే ఉంటారు. మరీ ఒక్కసారి ఆ స్వామి కి పూసి ఉన్న చందనం చూసారా? ఆ చందనం ఎందుకు పూయబడిందో తెలుసుకున్నారా?
                       ఇదిగో నేను చెప్తున్నా వినండి....  ఎందుకంటే... 
                        సీత దేవి ఆచూకి  కనిపెట్టడానికి హనుమంతుడు లంక కి వెళ్తాడు కదా. అక్కడ సీతమ్మ వారి నుదుట ఉన్న బొట్టు చూసి ఇలా అడుగుతాడు ... "అమ్మ నువ్వు ఆ బొట్టు ఎందుకు పెట్టుకున్నావ్" ఇలా అడిగినపుడు ఆ సీతమ్మతల్లి " న రాముడి ఆయుశ్హు పెరగాలని" అని చెప్పినదట. అది విన్న ఆంజనేయ స్వామి శ్రీరామ చంద్ర మూర్తి కోసం తన ఒళ్ళంతా చందనం పూసుకోవడం ఆరంభించినాడట . అందుకని ఆ సంప్రదాయం అలాగే నేటికీ కొనసాగుతూ ఉంది.
                                         జై శ్రీ రామ్ 

ఎవరైనా ఇది తెలియచేయరా..... ప్లీజ్...

నా బ్లాగ్ చదివిన  వాళ్ళు వ్యాఖ్యలు తెలుగు లో రాయాలి అంటే ఎలా అని అడుగుతున్నారు. తెలుగు లోవ్యాఖ్యలు  రాయాలి అంటే  ఎలా? బ్లాగ్గర్స్ అయితే వాళ్ళ బ్లాగ్ న్యూ పేజి లో ముందుగా రాసుకొని కాపీ -పేస్టు చేయొచ్చు. కాని మిగతా వాళ్ళు ఎలా రాయగలరో దయచేసి నాకు ఎవరైనా తెలియ చేయండి.
ప్లీజ్......... 

18 ఏప్రి, 2011

పూణే వారియర్స్ చేసింది చాలా మంచి పని.

పూణే వారియర్స్ మొదలు పెట్టిన "Cheer Queens" పద్ధతి  మెచ్చుకోదగినది. ఇలా చేయడం వలన మన దేశము లోని అన్ని రకాల నృత్య కలలకి ఆదరణ లభిస్తుంది. అంతే కాకుండా మన లోని నూతన కళాకారులకి ఒక విధమైన ప్రోత్సాహము ఇచినట్లు అవుతుంది. ఇవ్వాళా ఉన్న పరిస్థితి లోఒక స్కూల్ పిల్లాడిని ఇలా అడిగితే..." మన దేశం లో ఎన్ని రకాల నృత్య కళలు ఉన్నాయి అని అడిగితే"   జవాబు చెప్పే వాళ్ళు చాల అరుదు. కాని ఒక క్రికెటర్ పేరు చెప్పగానే వాడి పుట్టు పూర్వోత్తరాలు అన్ని గడ గడా చెప్పేస్తారు. మరి అంతటి పోపులరితి ఉన్న వేదిక దొరికినప్పుడు అంది పట్టుకోవడం గొప్పవాళ్ళ లక్షణం . అదే పని పూణే టీం మొదలు పెట్టింది. మిగతా టీం లు కూడా ఇదే పద్ధతి ని పాటిస్తే బాగుంటది. కదా...! మీరు  ఏమంటారు?
కాకపొతే ఒక చిన్న మార్పు ఉంటె బాగుంటదని నేను అనుకుంటున్నా.
ఏంటంటే... మన దేశం లో ఒక్కో ప్రాంతానికి/ రాష్ట్రానికి ఒక్కో ప్రత్యెక నాట్యం ఉంది.  దాన్ని ఆయా టీం వాళ్ళు తీసుకొని ప్రదర్శిస్తే బాగుంటది( అన్ని రాష్ట్రాల నాట్యలని ఒకే టీం ప్రదర్శించకుండా). 

నా ప్రశ్న నేడు దేశమంతటా వెలుగు లోకి వచ్చింది.

నేను ఆ నాడు వేసిన ప్రశ్న కి కార్య రూపం రాబోతుంది. ఏంటో తెలుసా.... మన నోటు మీద కేవలం గాంధీ నే ఎందుకు ఉండాలి అని??? 
ఈ ప్రశ్న కి స్పందించిన వారందరికి నా ప్రత్యెక నమస్కారములు. నేను ఈ రోజే ఒక ఆర్టికల్ చదివాను. అది చదివిన తర్వాత మీతో తప్పకుండ పంచుకోవాలి అని అనుకున్నా . అంతే,వెంటనే మీకు కూడా అది చదివి వినిపించాలనే ఆశ తో  ఇలా ఆ ఆర్టికల్ నిఇక్కడ లింక్ చేస్తున్నాను. మీరు కూడా దానిని  చదవాలని కోరుకుంటున్న.