26 జన, 2013

భారతీయులందరికీ అంటే మన అందరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

64 వ గణతంత్ర దినోత్సవ సందర్భం గా గూగుల్ ఇచ్చిన డూడుల్ చూసారా..
మన జాతీయ మృగం పులి, ఇండియా గేటు , చిన్న కమలం పువ్వులతో మూడు రంగుల బ్యాక్ గ్రౌండ్ తో అటవీ ప్రాంతాన్నిచుట్టూ  పరుచుకొని ఉంది.
 చూడగానే నచ్చింది..
కాని ఏదో లోపం ఉన్నట్లు అనిపించింది..
ఏంటంటే.. జాతీయ మృగం, జాతీయ పుష్పం  లను ఉపయోగించినప్పుడు జాతీయ పక్షి లేని లోటు స్పష్టం గా కనిపిస్తుంది. కాని ఒకసారి మన స్వాతంత్ర్య  దినోత్సవానికి ప్రత్యేకం గా నెమలి( జాతీయ పక్షి ) తో డూడుల్  తయారు చేసారు కదా, అందుకే ఈ సారి ఆ  కాన్సెప్ట్ పెట్టలేదేమో!!!
 ఇదిగో గూగుల్ డూడుల్స్...

 

24 జన, 2013

"సీతమ్మ వాకిట్లో సిరి మల్లె చెట్టు " లో 10 పాయింట్స్ ఇవి



  1.  సినిమా పేరు వింటేనే  బాగుంది . ఇక చుస్తే...??
  2. ఇద్దరు పెద్ద హీరోలు. ఎవరి ఆక్టింగ్  ఘనత వారిదే. మరి ఈ సినిమాని ఎం చేస్తారో?
  3. హీరోయిన్స్ ఓకే..
  4. జయసుధ ఓకే..
  5. ఇక ప్రకాష్ రాజ్ ... ఆ నవ్వేంటి రా బాబోయ్ ! అస్సలు చూడలేక పోయాం. ఈ రోల్ ఇంకా వేరే ఎవరికయినా ఇచ్చి ఉంటె బాగుండేదేమో అని పించింది.
  6. ఇక స్టొరీ విషయానికి వస్తే ... నిల్ కంప్లీట్ గా స్టొరీ నే లేదు. దర్శక మహాశయుడు ఏమి చెప్దమనుకున్నాడో  ఏమో.. అసలు  కథ లోఆద్యన్తాలె  లేవు .
  7. చిన్న చిన్న పిల్లలు అలిగితే ఎలా మొహం మాడ్చుకుంటారో  అదే సినిమా మొత్తం పెద్ద హీరోలతో చూపించాడు మన శ్రీకాంత్ అడ్దాల .
  8. ఇంట పెద్ద హీరోలతో సినిమా తీయాలి అనే ఆలోచన  వచ్చినప్పుడు ఒక మంచి కథ తో , చక్కటి మ్యూజిక్ తో సినిమాలోని కుటుంబం సంతోషం గా ఉన్న సీన్లు పెట్టి అక్కడక్కడ మంచి ఒక విధమయిన కడుపుబ్బ  నవ్వించే బూతులు లేని హాస్యాన్ని అందించి సినిమా చూస్తున్నంత సేపు ఒక కొత్త ఉత్సాహం తో సంతోషం గా ఉన్న  కుటుంబాన్ని కలిసివచ్చామనే భావన కలిగించి ఉంటె బాగుండేది . 
  9. మొత్తానికి ఏది ఏమయినా దిల్రాజ పంట పండింది.
  10. ఒకటి మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే.. ఈ మధ్య వస్తున్న ఒకటే టైపు సినిమా లాగా కాకుండా అంటే కొంచెం భిన్నం గా ఇద్దరు హీరోలతో తీయడం .      ఇలాంటి సినిమాలు మళ్ళీ మన తెలుగు సినమ లోకం లోకి మరిన్ని రావాలి .

12 జన, 2013

అసలు మనము ఎక్కడికి పోతున్నాం???

రోజు రోజు కి మన దేశం లో జరిగే సంఘటనలని చూస్తుంటే మనము ఎక్కడి పోతున్నామ అనే సందేహం కలుగుతుంది.

నేను ఈ మధ్య ఒక బ్లాగ్ లో పెళ్లి గురించి వచ్చిన ఒక వ్యాసం చదివాను. ఆ బ్లాగర్  వివాహం అనే బంధాన్నికొంచెం  వివరించి వ్రాసాడు.అది  బాగానే ఉంది, ఆయన ఎం చెప్పాలనుకున్నాడో అది తన వ్యక్తిగత విషయం .. తనకు నచ్చ్హిన విధం గా చెప్పాడు.
అయితే అది చదివిన వారిలో ఒకరు కామెంట్  చేసిన తీరు చాలా  అసభ్య కరం గా ఉంది.
కన్న తల్లి తండ్రుల విషయం లో ఆయన  మాట్లాడిన విధానం చుస్తే కళ్ళు,చెవులు   ముసుకోక తప్పదు మరి.కాని  తను వ్రాసిన విధానం గమనిస్తే మంచి చదువరి అని అనిపించింది. తను వ్రాసింది సబబబే అని నిరుపించుకోవడానికి ఎంత ప్రయత్నించాడో అనేది ఆ వ్యాసం చదిన ప్రతి ఒక్కరికి అర్థమయ్యె ఉంటుంది ఈపాటికి . అలా ఉన్నాయి  మన చదువులు,సంస్కారాలు.
   ఇక డిల్లీ అమ్మాయి కి జరిగింది చాలా ఘోరమయిన  అన్యాయం అని తెలిసి కూడా, సాక్ష్యాధారాలు అన్నీ దొరికినా కూడా మన చట్టాలు, న్యాయ స్థానాలు ఇంకా నానుస్తూనే ఉన్నాయి.
అసలు ఆ కేసు ఎంత దూరమ్ పోతుందో , అసలు తీర్పు ఈ దశాబ్ద కాలం లోపల వెలువడుతుందో లేదో అనిపిస్తుంది. ఎందుకంటే ఆ కేసు తర్వాత అలాంటివి చాల వెలుగు లోకి వచ్చాయి . వాటిలో కొన్ని 10,15 సంవత్సరాలయినా కూడా తీర్పు వేలువదలేదనట . ఇలా ఉన్నాయి మన న్వ్యవస్థలు.
ఇక మన రాష్ట్రం లో చుస్తే 3 ఏళ్లుగా ఒకటే బంద్ లు,గొడవలు, అల్లర్లు, తెలంగాణా , ఆంధ్రా అని.
ఈ రాజకీయ నాయకులూ వాళ్ళు బతకడానికి మనల్ని చంపుకు తింటున్నారు. చదువుకుంటున్న విద్యార్తులు కూడా "ఊ" అంటే బంద్ అంటున్నారు. వాళ్ళే కాదు వాళ్ళకి చదువు చెప్పే గురువులు కూడా అదే ప్రోత్సహిస్తుంటే ఏమననుకోవాలి? ఒక ప్రాంతం అభివృధ్హి చెందాలంటే కావాల్సింది పాలకుల్లో చిత్త  శుద్హి, అక్కడి వ్యవస్థ లో పారదర్శకత, సత్యము, ధర్మమూ..
ఇవి కనక ఉంటె ఆ ప్రాంతం కలిసి ఉన్న, విడిపోయినా ప్రజలు సుఖం గా బతుకుతారు.
అసలు ఇవే  సరిగ్గా లేనప్పుడు ఎంత మార్పు వస్తే ఏం  లాభం? ముందు మన నాయకులు , వారి తీరు మారనిది మనము ఎంత బంద్ లు చేసినా వృధాయే కదా!!
  ఈ మధ్య you tube  లో దుమారం లేపిన ఒక హైదరాబాద్ వాసి, ప్రజా నాయకుడు గారి ఉపన్యాసం వింటే ఒళ్ళు దద్దరిల్లింది. ఎంతగా కావాలని మత కలహాలు సృష్టిస్తున్నాడా  అని ఆవేదన కలిగింది. ఆయన గారు అలా ఉపన్యాసం ఇస్తూ ఉంటె అక్కడి రక్షక భట యంత్రాంగం ఎం చేస్తుండే అక్కడ?
మన కెమరమన్ గంగ తో రాంబాబు ఎం చేస్తుండే అక్కడ? ఎక్కడో గుడి చుట్టూ పంది  ప్రదక్షణాలు చేసినదని, లేకపోతె కోతి ఏదో వింత చేసిందని, చెత్త చెత్త బ్రేకింగ్ న్యూస్ లతో  లేకపోతె అనవసరమయిన డిస్కషన్స్ పెట్టి చానల్ నడుపుకు పోతున్న వారికి పాపులర్ స్పీచ్ గురించి ఎందుకు న్యూస్  కవర్ చేయలేదో? ఎంత సేపు కమర్షియల్ న్యూస్ ఎ తప్ప ప్రజలకు ఉపయోగ పడేవి మాత్రం శూన్యం.
     ఇవన్ని చూస్తుంటే మొత్తం మన దగ్గర ఉన్న ప్రతి వ్యవస్థ కుల్లిపోయినట్లుగా అనిపిస్తుంది. ఎలాంటి వవ్స్తలో ఉన్న మనమ ఎటు పోతున్నామా అని భయం గా  ఉంది.  







8 జన, 2013

2013 వచ్చెన్! ... అప్పుడే వారం గడిచెన్!!

కొత్త సంవత్సరం మొదలై అప్పుడే వారం అవుతుంది.
మనలో చాలా మందిమి ఈ సంవత్సరం లో ఇది చేయాలి, అది చేయాలి అని అనుకొని ఓ పక్క ప్రణాళిక కూడా వేసేసి ఉంటారు. మరి అమలు కార్యక్రమం అసలు ఇంకా మొదలయ్యిందా లేదా?? 
మొదలు పెట్టిన వారికి  ఓహో...
పెట్టని వారికి "-----------" ఇకనైనా మొదలు పెట్టి ఓహో అని అనిపించుకోండి.




సహనం అంటే ఏమిటి?



ఎవరయినా తిట్టినా , కోప్పడినా, ఏదైనా  ఇష్టం లేని ఉచిత సలహా ఇచ్చినా, మనకు నచ్చని వారిని పొగిడినా, 
శక్తి కి మించి పని చేసినా, పిల్లలు సతాయించినా, అట లో ఓడిపోయినా వెంటనే కోపం వస్తుంది.
ఆ కోపం తట్టుకోలేని విధం గా తయారవుతుంది.
ఆ కోపం లో    చేయాల్సిన పనులను సక్రమం గా చేయము తద్వారా మన మీద మనకే మళ్ళీ కోపం మొదలవుతుంది.
ఇలాంటివన్నీ నిత్యం మన చుట్టూ జరుగుతూనే ఉంటాయి. అనుభవిస్తాం, బాధ పాడుతాం, మారాలి అనే ఒక చిన్న ప్రయత్నం చేస్తాం కాని మారము. అంతే ...ఇది ఒక చక్రం లా జరుగుతూ ఉంటది.
కోపం తగ్గాక ఆలోచిస్తే... ఛీ.. ఒక్క క్షణం అలోచించి చేస్తే బాగుండేది, అనవసరం గా మళ్లీ  తప్పు చేశాను అని అనుకుంటాం . ఆ ఒక్క క్షణం ఆలోచన అనేది సహనం . అది ఉన్న వాడు ఎప్పుడు తిరిగి తప్పు చేయడు .